Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ: 50 మంది నో చెప్పారట!

ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ: 50 మంది నో చెప్పారట!
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (18:50 IST)
ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపణీపై సమగ్రంగా చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన 50 మంది అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీపై స్పష్టత రాకపోవడంతో సమావేశం మరోసారి వాయిదా పడింది. మలి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుత జాబితాపై దాదాపు 50 మంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు.

Share this Story:

Follow Webdunia telugu