Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారం.. కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం...!

కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారం.. కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం...!
, శుక్రవారం, 30 జనవరి 2015 (09:07 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీపడుతున్న కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈమె ప్రచారంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ విషయం గురించి కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ, నిర్మలా సీతారామన్‌తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడుతూ...
 
ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం జరిపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి ఐదో తేది వరకు ప్రతిరోజూ క్రేజీవాల్‌పై ఐదు ప్రశ్నలు సంధించనున్నట్టు తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నాలుగు ర్యాలీలు నిర్వహిస్తారని, పార్టీ తరపున మొత్తం 250 ఎన్నికల ర్యాలీలు జరుపుతామని రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే ఆప్ పార్టీ మాత్రం బీజేపీ ప్రశ్నాస్త్రాన్ని తేలిగ్గా తీసిపారేసింది. ఆప్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రశ్నలు అడగడానికి బదులు ఆ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీని కేజ్రీవాల్‌తో చర్చకు రప్పించాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu