Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశీ మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో... ఢిల్లీ యువకులకు 30 ఏళ్ల జైలు

విదేశీ మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో... ఢిల్లీ యువకులకు 30 ఏళ్ల జైలు
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (07:10 IST)
ఢిల్లీలో అత్యాచారాల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో నిందితులకు పడుతున్న శిక్షలు కూడా అందుకు తగ్గట్టుగానే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఉగాండా మహిళను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు యువకులకు ఢిల్లీ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విదేశాల నుంచి వచ్చిన అతిథుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో కోర్టు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.
 
ఢిల్లీకి చెందిన రాజ్‌కుమార్, దినేశ్ శర్మలు ఉగాండాకు చెందిన ఓ మహిళపై ఢిల్లీలో అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదయి విచారణ జరిగింది. కోర్టు మంగళవారం దీనిపై తీర్పు వెలువరించింది. నిందితులకు 30 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ తీర్పు ఇచ్చారు. ఆకలిగొన్న తోడేలు ఆహారం కోసం వెంపర్లాడినట్లు నిందితులు ప్రవర్తించారని జడ్జి పేర్కొన్నారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu