Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2జీ స్కామ్ : రాజా, కనిమొళికి బెయిల్ మంజూరు!

2జీ స్కామ్ : రాజా, కనిమొళికి బెయిల్ మంజూరు!
, బుధవారం, 20 ఆగస్టు 2014 (19:09 IST)
2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌కు సంబంధించిన రూ.200కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, బుధవారం ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్‌కు కూడా బెయిల్ లభించింది.
 
దయాళు అమ్మాల్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం రూ.5 లక్షల సొంత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే అదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీని ఇవ్వాలని చెప్పింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu