Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21 ఏళ్ల యువతిపై పేయింగ్ గెస్ట్ యజమాని అత్యాచారం... చెప్తే చంపేస్తానని...

21 ఏళ్ల యువతిపై పేయింగ్ గెస్ట్ యజమాని అత్యాచారం... చెప్తే చంపేస్తానని...
, శనివారం, 28 నవంబరు 2015 (14:56 IST)
ఢిల్లీలో అత్యాచారాల పరంపర సాగుతూ ఉంది. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులు యువతులపై లైంగిక దాడులను చేస్తూనే ఉన్నారు. తాజాగా గుర్గాన్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతికి పేయింగ్ గెస్ట్ యజమానిగా ఉంటూనే ఆమెపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన గురువారం రాత్రి 8 గంటలకు చోటుచేసుకోగా ఫిర్యాదు శుక్రవారం నాడు అందింది. బాధితురాలు ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది.
 
వివరాల్లోకి వెళితే... తనను బెదిరించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు గుర్గాన్ మహిళా పోలీసు స్టేషనుకు ఫిర్యాదు చేసింది. యజమాని ధర్మవీర్ తన గదిలోకి రాత్రి 8 గంటల ప్రాంతంలో బలవంతంగా వచ్చాడనీ, తనను బెదిరించి అత్యాచారం చేశాడని పేర్కొంది. అత్యాచారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడని కూడా వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఐతే అప్పటికీ అతడు పలాయనం చిత్తగించాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కాగా బాధితురాలిది పంజాబ్ రాష్ట్రం అని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu