Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో పట్టపగలు మైనర్ బాలికపై 12 మంది గ్యాంగ్ రేప్

దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాల అడ్డాగా మారింది. బులంద్‌షహర్ అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ మైనర్ బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపి హత్య చే

యూపీలో పట్టపగలు మైనర్ బాలికపై 12 మంది గ్యాంగ్ రేప్
, శనివారం, 27 ఆగస్టు 2016 (13:54 IST)
దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాల అడ్డాగా మారింది. బులంద్‌షహర్ అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ మైనర్ బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపి హత్య చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ నగ్లాసంత్ గ్రామంలో 14 ఏళ్ళ మైనర్ బాలికపై 12 మంది అత్యాచారానికి ఒడిగట్టడమే కాక, ఆమెను హత్య చేయడం ఆందోళన రేపుతోంది. ఆగస్టు 20న బాలిక పొలానికి వెళ్ళిన సమయంలో ఏకంగా 12 మంది.. పట్టపగలే ఆమెను దారుణంగా చంపి, అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
సురేంద్ర అనే వ్యక్తితోపాటు మరో 11 మందికి వ్యతిరేకంగా బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయం చేయ‌క‌పోగా రివ‌ర్స్ వాయింపుడు... బాబును పుష్క‌ర లెక్క‌లు అడుగుతున్న బీజేపీ...