Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మృగాడిని ఉరితీసిన గ్రామస్తులు...

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మృగాడిని ఉరితీసిన గ్రామస్తులు...
, గురువారం, 30 జులై 2015 (17:36 IST)
మహిళలు, బాలికలపై హత్యాచారాలు, ఆఘాయిత్యాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడంలో లేదు. దీంతో ప్రజలే మృగాళ్ల భరతం పడుతున్నారు. తాజాగా బీహార్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన మృగాడిని గ్రామస్తులు చితకబాది ఉరితీసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో బాలిక అరుపులు, ఏడుపు విన్న ప్రజలు, హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ బాలిపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఆ సమయంలో తీవ్ర ఆవేశానికిగురైన గ్రామస్తులు తొలుత అతడిని చితకబాదారు. అనంతరం ఆ మృగాన్ని గ్రామస్తులు ఉరితీసి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘట ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu