రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి.
హర్యానాలోని హిస్సార్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం హిస్సార్ రైల్వే స్టేషన్కు సమీపంలో కాపలా లేని లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే ట్రైన్ వస్తున్న విషయం గమనించకుండా డ్రైవర్ ట్రక్కును ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.