Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌లో రెండు లారీలు ఢీ : 11 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో రెండు లారీలు ఢీ : 11 మంది దుర్మరణం
, ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (10:49 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జోధ్‌పూర్ హైవే మీద వెళుతున్న రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న వారిలో మరికొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేకువజామున ఒక లారీ డ్రైవర్ కునుకు కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu