Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికపై బంధువు అత్యాచారం.. హాస్టల్ లోనే ప్రసవం.. పసికందు హత్య

బాలికపై బంధువు అత్యాచారం.. హాస్టల్ లోనే ప్రసవం.. పసికందు హత్య
, గురువారం, 29 జనవరి 2015 (08:07 IST)
బంధువనే చనువుతో ఓ బాలికపై అత్యాచారం చేశాడో రాక్షసుడు.. అలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడం హాస్టల్ లోనే ప్రసవం జరిగిపోయాయి. పుట్టిన బిడ్డను చంపేసి.. పరారయ్యాడు.. ఈ దారుణ సంఘటన చత్తీస్ఘడ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  
 
చత్తీస్గఢ్లో కొరియా జిల్లా రాంపూర్ బ్లాక్ రెసిడెన్సియల్ స్కూల్లో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ బాలికపై సమీప బంధవు ఒకరు పలుమార్లుగా హాస్టల్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయాన్ని బయట పెట్టకుండా హాస్టల్ వార్డెన్ కూడా దాచి పెట్టారు. తరువాత హాస్టల్లోనే బలవంతంగా ప్రసవం చేయించారు. ఆపై పుట్టిన పసి కందును సమీపంలోని నదిలో పారేశారు. అయితే ఈ సంఘటన బయటకు పొక్కి మీడియాలో ప్రచురితమైంది. అప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. 
 
కొరియా జిల్లా కలెక్టర్ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నిందితుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. కానీ సూపరింటెండెంట్, ఆమె భర్త పరారీలో ఉన్నారు. సూపరింటెండెంట్ బలవంతంగా బాలికకు హాస్టల్ క్యాంపస్లో ప్రసవం చేయించినట్టు పోలీసులు తెలిపారు. నది సమీపంలో పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనపై అత్యాచారం చేశాడని, హాస్టల్లోనే ప్రసవించినట్టు బాధితురాలు విచారణలోతెలిపింది.  ఇంత జరిగినా ఆమె కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

Share this Story:

Follow Webdunia telugu