Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్‌పై 100 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తు

ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్‌పై 100 రౌండ్ల కాల్పులు
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి ఢిల్లీ శివార్ల‌లో జరిగింది. 
 
టొయొటా ఫార్చున‌ర్‌లో వ‌చ్చిన దుండ‌గులు ఏకే 47 రైఫిల్స్‌తో వంద రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బ్రిజ్‌పాల్‌.. ప్ర‌స్తుతం నోయిడాలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఐదుగురు కూడా ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి వారితో డేటింగ్ చేసేందుకు సై.. కానీ వారే ఇష్టపడం లేదు : సెలినా గొమేజ్‌