Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందుత్వ నినాదాన్ని వీడం: రాజ్‌నాథ్ సింగ్

హిందుత్వ నినాదాన్ని వీడం: రాజ్‌నాథ్ సింగ్
, ఆదివారం, 26 జులై 2009 (17:32 IST)
భారతీయ జనతా పార్టీ నినాదమైన హిందుత్వను విడనాడే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. దీనిపై ఆయన ఆదివారం లక్నోలో మాట్లాడుతూ... హిందుత్వ అజెండాను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడబోమని స్పష్టం చేశారు. హిందుత్వ అజెండా గురించి మాకు పూర్తిగా తెలుసు.

దీన్నే మేము మున్ముందు కొనసాగిస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడబోమని చెప్పారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తల నుద్దేశించి పై విధంగా అన్నారు. హిందుత్వ నినాదం మనకు ఉత్తేజం కలిగిస్తుందన్నారు. అందువల్ల ఈ నినాదానికి తాము కట్టుబడి ఉన్నట్టు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెల్సిందే. దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు హిందుత్వ అజెండాను విడనాడాలని పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. అయితే, రాజ్‌నాథ్ మాత్రం హిందుత్వను విడనాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu