Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుష్మాకు మన్మోహన్ ఫోన్ : తెలంగాణ బిల్లుకు మద్దతివ్వండి!

సుష్మాకు మన్మోహన్ ఫోన్ : తెలంగాణ బిల్లుకు మద్దతివ్వండి!
, మంగళవారం, 30 జులై 2013 (19:41 IST)
File
FILE
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌కు మంగళవారం స్వయంగా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి విలేకరులతో వెల్లడించారు.

ప్రధాని తమ నేత సుష్మకు ఫోన్ చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కోరారని చెప్పారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. కాగా తెలంగాణ సాకారమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు సుష్మా స్వరాజ్ శుభాకాంక్షలు చెప్పారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu