Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శౌర్య పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

శౌర్య పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
, శనివారం, 10 ఏప్రియల్ 2010 (11:52 IST)
విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచిన త్రివిధ దళాల సిబ్బందికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ శుక్రవారం శౌర్య పతకాలు ప్రదానం చేశారు. రెండు కీర్తిచక్ర (దేశంలో శాంతి సమయంలో అందించే రెండో అత్యుత్తమ పురస్కారం) అవార్డులతోపాటు 23 శౌర్యచక్ర, 15 పరమ్‌ విశిష్ట సేవా పతకాలను అందించారు.

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన తెలుగుతేజం మేజర్‌ జె.సురేశ్‌ సూరితోపాటు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన మేజర్‌ అమిత్‌ ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌కు కీర్తిచక్ర పతకాలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అందించారు. సురేశ్ తరపున ఆయన భార్య పల్లవి ఈ పతకాన్ని స్వీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu