Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముస్లిం ప్రజలకు రాష్ట్రపతి "రంజాన్" శుభాకాంక్షలు

ముస్లిం ప్రజలకు రాష్ట్రపతి
"రంజాన్" పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. "రంజాన్" పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని పాటిల్ ఆకాంక్షించారు. అదేవిధంగా జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ ప్రతిభా పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్య సమరంలో పాలు పంచుకుని భారతదేశానికి... ఆంగ్లేయుల నుంచి విముక్తి సంపాదించిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ దేశసేవ ఎనలేనిదని పాటిల్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

దేశ ప్రజలందరూ నీతినియమాలతో, స్నేహభావంతో పురోగమించాలని, పేద ప్రజలను ఆదుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గాంధీజీ శాంతి మార్గాన్ని అన్వేషించాలని, హింసాత్మక చర్యలకు చరమగీతం పాడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు.

గాంధీజయంతి సందర్భంగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని పలు విద్యాసంస్థలు, ఆశ్రమాలకు దుస్తులు, బియ్యం, నెయ్యి, పప్పు దినుసులు, చక్కెర వంటి అత్యావసర వస్తువులను పంపించనున్నట్లు పాటిల్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu