Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా సర్కారుపై యూపీఏ కుట్ర: గుజరాత్ సీఎం మోడీ

మా సర్కారుపై యూపీఏ కుట్ర: గుజరాత్ సీఎం మోడీ
, ఆదివారం, 14 ఆగస్టు 2011 (12:13 IST)
తమ సర్కారును అస్థిరపరిచేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కట్ర పన్నుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. ఇందులో కేంద్ర హోం మంత్రి చిదంబరంపై ఫిర్యాదు చేశారు.

గుజరాత్ ప్రభుత్వ వైఖరితో ఇబ్బంది పడుతున్న పోలీసు అధికారులు స్వయంగా కోరితే సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పోలీసు బలగాల్లో క్రమశిక్షణారాహిత్యాన్ని పెంచేందుకే అలా మాట్లాడారని ఆరోపించారు.

ఈ విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ జోక్యం చేసుకోవాలని మోడీ కోరారు. పోలీసుల క్రమశిక్షణారాహిత్యాన్ని పెంచి పోషించేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చిదంబరం వ్యాఖ్యలు దేశ సమాఖ్య వ్యవస్థలో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu