అవినీతి నిర్మూలన కోసం పటిష్టమైన లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలన్న అంశాన్ని సామాజికవేత్త అన్నా హజారే నిర్ణయానికే విదిలివేస్తూ అన్నా బృందం సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో ఈ తరహా తీర్మానం చేశారు. ఈ సమావేశ వివరాలపై అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయించే అధికారం హజారేకే వదిలిపెట్టినట్టు చెప్పారు.
తాము చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రారంభించలేదన్నారు. అందువల్ల తమకు రాజకీయ రంగు అంటగొట్టదని చెప్పారు. కాగా, అనారోగ్యం కారణంగానే హజారే ఈ భేటీకి దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు.