Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరులో మటన్ బిర్యానీ వడ్డించలేదని పెళ్లి క్యాన్సిల్!!

బెంగుళూరులో మటన్ బిర్యానీ వడ్డించలేదని పెళ్లి క్యాన్సిల్!!
, గురువారం, 13 మార్చి 2014 (09:19 IST)
File
FILE
బెంగుళూరులో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వరుడి తరపు బంధువులు మటన్ బిర్యానీ వడ్డించాలని కోరారు. కానీ, వధువు కుటుంబ సభ్యలు మాత్రం ఆ మాటలను తేలికగా తీసుకుని చికెన్ బిర్యానీ వడ్డించారు... సీన్ కట్ చేస్తే వరుడు తరుపు కుటుంబ సభ్యులంతా కలిసి ఆ పెళ్ళి క్యాన్సిల్ చేశారు.

బుధవారం చోటు చోసుకున్న ఈ సఘటన వివరాలు పరిశీలిస్తే... బెంగుళూరుకు చెందిన సైఫుల్లా, యాస్మిన్ తాజ్ అనే జంటకు వివాహం చేయాలని ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక కేజీ హళ్ళిలోని ఓ మసీదు వద్ద నిఖా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.

పెళ్ళి రిసెప్షన్ సందర్భంగా తమకు మటన్ బిర్యానీ వడ్డించాలని వరుడు సైఫుల్లా బంధువులు కోరగా... యాస్మిన్ కుటుంబీకులు 30 కిలోల చికెన్‌తో సరిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో, ఇరువర్గాల మధ్య వాగ్వివాదం మొదలైంది.

ఇంత చిన్న విషయానికే సర్దుకోలేకపోతే, భవిష్యత్తులో పెళ్ళికొడుకు ఇంకెన్ని సమస్యలు సృష్టిస్తాడోనని భావించిన వధువు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఇరువైపుల నుంచి పెద్దలు సమావేశమై చర్చించినా రాజీకుదరలేదు. దీంతో పెళ్ళి రద్దు చేసుకోవడమే మేలని ఇరు వర్గాలు తీర్మానించాయి.

Share this Story:

Follow Webdunia telugu