Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్‌ను ముంచెత్తిన వరదలు

బీహార్‌ను ముంచెత్తిన వరదలు
బీహార్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. బీహార్‌లోని బాగ్‌మతి నదికి వరదలు రావడంతో సీతామర్హి జిల్లాలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

దాదాపు 200 గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.

మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పర్యటించనున్నారు. వరద బాధితులకు అత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu