Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో ముస్లిం నాయకులుండకూడదు: విహెచ్‌పీ

బీజేపీలో ముస్లిం నాయకులుండకూడదు: విహెచ్‌పీ
షాహ్‌నవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ లాంటి ముస్లిం నేతలు బీజేపీలోనున్న విషయం విదితమే. కాని వీరంటే విశ్వహిందూ పరిషత్‌కు అస్సలు గిట్టడంలేదు. ముఖ్యంగా ఏ ముస్లిం నాయకులుకూడా భారతీయ జనతా పార్టీలో వుండడానికి వీలులేదని స్పష్టం చేసింది. వీరిని మేము ఎట్టి పరిస్థితులలోనూ ఒప్పుకోమని విశ్వహిందూ పరిషత్ నాయుకుడు గిరిరాజ్ కిషోర్ స్పష్టం చేశారు.

ఇదివరకు షాహ్ నవాజ్ హుస్సేన్ ఇదివరకు కూడా ఇలాంటి తిరస్కారాన్నే ఎదుర్కొన్నారు. ఈయన గతంలో 2005వ సంవత్సరంలో భాగల్పూర్ ఉప ఎన్నికలలో ఆలయ ప్రవేశం చేస్తే ఆ ఆలయ మెట్లు కడిగించారు పూజారులు. దీనికి సంబంధించి విహెచ్‌పీ ఆ పూజారికి మద్దతుగా కూడా నిలిచింది. అయినాకూడా విహెచ్‌పీ బీజేపీతోనే వుంటుందని ఆ పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu