Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్‌‌ను హజారే బృందం నమ్మాలి: మంత్రి ఖుర్షీద్

పార్లమెంట్‌‌ను హజారే బృందం నమ్మాలి: మంత్రి ఖుర్షీద్
, గురువారం, 4 ఆగస్టు 2011 (14:00 IST)
దేశ పార్లమెంట్ వ్యవస్థపై ప్రముఖగాంధేయ వాది అన్నా హజారే బృందానికి నమ్మకముండాలని కేంద్ర న్యాయ శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. కేంద్రం రూపొందించిన లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెల్సిందే. ఈ బిల్లును అన్నా హజారే బృందం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ.. కేంద్రం రూపొందించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతామన్నారు.

అయితే, పార్లమెంట్‌ పట్ల అన్నా హజారే బృందానికి నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ బృందం ఖచ్చితంగా నమ్మకం కలిగివుండాలన్నారు. ఈ బిల్లుకు ప్రత్యేక ప్రాధాన్యతను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు ఆయన తెలిపారు. కాగా, కేంద్రం రూపొందించిన ఈ బిల్లు నుంచి ప్రధానమంత్రితో సహా న్యాయ వ్యవస్థను, ఎంపీలను మినహాయిస్తూ రూపొందించారు.

Share this Story:

Follow Webdunia telugu