Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పలు రాష్ట్రాలకు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జుల నియామకం

పలు రాష్ట్రాలకు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జుల నియామకం
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పలు రాష్ట్రాలకు పార్టీ తరపున ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించారు. త్వరలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు చోటు చేసుకున్నాయి. దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు రాజ్‌నాథ్ సింగ్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అలాగే, ఉత్తరాఖండ్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు.

వీరిద్దరితో పాటు పంజాబ్‌కు జేపీనడ్డా, హర్యానాకు డాక్టర్ హర్షవర్ధన్, జమ్మూకాశ్మీర్‌కు జగ్దీష్ ముఖీ, కో ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ అనిల్ జైన్, హిమాచల్ ప్రదేశ్ కో ఇన్‌ఛార్జ‌గా శ్యామ్ జజూ, ఢిల్లీకి నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కో ఇన్‌ఛార్జ్‌గా రావేశ్వర్ చౌరాసియాలను నియమించారు.

Share this Story:

Follow Webdunia telugu