Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగాలాండ్‌లో రోడ్డు ప్రమాదాలు: 13 మంది మృతి

నాగాలాండ్‌లో రోడ్డు ప్రమాదాలు: 13 మంది మృతి
, శనివారం, 3 అక్టోబరు 2009 (12:48 IST)
నాగాలాండ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ నుంచి కొంతమంది ప్రయాణికులతో వస్తున్న బస్సు ఒకటి లోతైన లోయలో బోల్తా పడింది. దిమాపూర్ సమీపంలోని చుముకిదిమా అనే ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్టు చెప్పారు. అలాగే, చుముకిడిమా గేట్ ప్రాంతంలో ఒక ట్రక్కు ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu