Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరపైకి బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాజా డిమాండ్!

తెరపైకి బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాజా డిమాండ్!
, గురువారం, 10 డిశెంబరు 2009 (17:47 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావును స్ఫూర్తిగా తీసుకున్న బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తీవ్రస్థాయిలో ఆందోళన చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ లక్ష్య సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

దీనిపై బుందేల్‌ఖండ్ ముక్తిమోర్ఛా అధ్యక్షుడు రాజా బుందేలా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పోరాటం చేయనున్నట్టు ప్రటించారు. ఇందుకోసం తెరాస అధినేత ఎంచుకున్న మార్గాన్నే అనుసరించనున్నట్టు ప్రకటించారు. దశాబ్దాల కాలంగా చేసిన ఆందోళనకు ప్రతిఫలం లభించిందన్నారు.

అలాగే, బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాము కూడా ఇదే తరహా స్థాయిలో ఆందోళన చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత 20 సంవత్సరాలుగా తాము పోరాడుతున్నామన్నారు. ప్రత్యేక స్వయంప్రత్తి లేనిదే తమ ప్రాంతం అభివృద్ధి అసాధ్యమని తమ ప్రజలు గుర్తించారని చెప్పారు. అందుకే ఉద్యమానికి కొత్త ఊపు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

ఇందుకోసం ఈనెల 16వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూత్ నుంచి కామతాథ్ వరకు 300 కిలోమీటర్ల లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. బుదేల్‌ఖండ్ కూడా తెలంగాణలాంటి సమస్యే అని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu