Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీపై లష్కరే తోయిబా గురి : నిఘా హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీపై లష్కరే తోయిబా గురి : నిఘా హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం
FILE
ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నింది. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో తీవ్రవాద దాడులు నిర్వహిస్తామని లష్కరే తోయిబా వ్యవస్థాపక అధినేత హఫీజ్ సయీద్ గత నెల పాకిస్థాన్‌లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై ఈ హెచ్చరికలను జారీ చేశాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu