Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేడీయూ, ఏడీఎంకేలతో కాంగ్రెస్ పొత్తు: షీలా

జేడీయూ, ఏడీఎంకేలతో కాంగ్రెస్ పొత్తు: షీలా
FileFILE
బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యు), తమిళనాడు ప్రతిపక్షమైన అన్నాడీఎంకే వంటి పార్టీలతో ఎన్నికల తరువాత పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్నికల తరువాత ఆ రెండు పార్టీలతో చెలిమి కుదురుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం బాగా పని చేసింది. అందరూ అదే చెబుతున్నారు. నితీశ్ కుమార్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజల వ్యక్తి అని దేశవ్యాప్తంగా నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షీలాదీక్షిత్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అన్నాడీఎంకేతో పొత్తుకు కూడా అవకాశాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ఇవన్నీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొందే సీట్లపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. మతతత్వ శక్తులతో కాకుండా, మిగిలిన పార్టీలతో జతకట్టేందుకు అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో పొత్తు సాధ్యమా అని అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ సాధ్యమేనని సమాధానమిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా నితీశ్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడులను ప్రశంసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్నికల తరువాత లెఫ్ట్ పార్టీలు తమకు మద్దతు ఇస్తాయని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu