Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చక్ర అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

చక్ర అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
స్వాతంత్ర్య దినోత్సం రోజున రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదగా చక్ర అవార్డులు అందుకోబోయే పౌరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత అశోక చక్ర పురస్కారాలను కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అశోక చక్ర అవార్డులను ఈసారి మేజర్ మోహిత్ శర్మ, మేజర్ డి.శ్రీకుమార్‌లకు అందించనున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరికీ మరణించిన తరువాత ఈ అవార్డులు దక్కబోతున్నాయి. రెండు అశోక చక్ర అవార్డులతోపాటు శనివారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నాలుగు సూర్య చక్ర, 131 కీర్తి చక్ర అవార్డులు కూడా అందజేయనున్నారు. గజియాబాద్‌కు చెందిన మేజర్ మోహిత్ శర్మ కాశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu