ఒడిషా రాయగఢ్లో యువతి గ్యాంగ్ రేప్ : విశాఖ ఆస్పత్రికి తరలింపు!
, మంగళవారం, 8 జనవరి 2013 (09:17 IST)
ఒడిషా రాష్ట్రంలోని రాయగఢ్లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వైజాగ్ ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. 16 యేళ్ళ మైనర్ బాలికపై ఆ దారుణం జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను ప్రపంచ ప్రజల ఇంకా మరచిపోక ముందే.. ఒడిషా రాష్ట్రంలో ఇలాంటి సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. కొందరు కామాంధులు ఈ గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి అవమానభారంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు.. హుటాహుటిన విశాఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ ఆస్పత్రిలో ఆ యువతికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.