అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ దక్షిణాసియా పర్యటనలో భాగంగా భారతదేశ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ముంబై వస్తున్నారు. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్తో కలిసి ఒకే వేదికపై కనిపించే అరుదైన అవకాశాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్కు దక్కింది.
వివరాలలోకి వెళితే...శుక్రవారం రాత్రి హిల్లరీ క్లింటన్ ముంబై వచ్చి తాజ్ హోటల్లో బస చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం ముంబైకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సెయింట్ జేవియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొననున్నారు.
తదనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు బాలీవుడ్ నటుడు, "గజనీ" హీరో అమీర్ఖాన్కూడా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఆయనను ఆహ్వానించటంతో అమీర్కు ఈ అరుదైన అవకాశం దక్కిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.