Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈవీఎంల పనితీరుపై అనుమానాలొద్దు: ఈసీ

ఈవీఎంల పనితీరుపై అనుమానాలొద్దు: ఈసీ
, సోమవారం, 6 జులై 2009 (09:05 IST)
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై ప్రధాన రాజకీయ పార్టీలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ వంటి నేత ఇలాంటి సందేహం వ్యక్తం చేయడం ఎన్నికల సంఘాన్ని దిగ్భ్రమకు గురి చేసింది.

ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై ఉన్న అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేసింది. ఈవీఎంలో టాంపరింగ్‌ జరిగిందన్న అద్వానీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఎన్నికల సంఘం పేర్కొంది.

అధికారంలోకి రాలేక పోయామన్న అక్కసుతో కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. రాజకీయ నేతలు లేవనెత్తే ప్రతి ధర్మ సందేహాన్ని తాము నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu