Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ముగ్గురు మంత్రులను జైలుకు పంపాలి: అన్నా హజారే

ఆ ముగ్గురు మంత్రులను జైలుకు పంపాలి: అన్నా హజారే
, గురువారం, 9 ఫిబ్రవరి 2012 (16:09 IST)
అసెంబ్లీకి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన కర్ణాటక మంత్రులను జైలుకు పంపాలని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే తెలిపారు. కర్ణాటక శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో నీలిచిత్రాలు చూస్తూ పట్టుబడిన ముగ్గురు మంత్రులపై అన్నా హజారే మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీలో బూతు బొమ్మలు చూసిన ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆ ముగ్గురు మంత్రులను బర్తరఫ్ చేసి, జైలుకు పంపాలని ఆవేశంతో అన్నారు.

ఇంకా రాజకీయ పార్టీల్లో ఇలాంటి హీనమైన వ్యక్తులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేతలే పవిత్రమైన అసెంబ్లీ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయ నేతల చేతుల్లో మన దేశ భవిష్యత్తు సర్వ నాశనమైపోతోందని అన్నా హజారే తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu