Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ పొత్తువల్ల సీపీఎం బలం తగ్గుతుంది: జ్యోతిబసు

ఆ పొత్తువల్ల సీపీఎం బలం తగ్గుతుంది: జ్యోతిబసు
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లు ఒకటిగా చేరడం వల్ల కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్‌లో తమ బలం తగ్గవచ్చని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు అభిప్రాయపడ్డారు. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ మాత్రం కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్‌లది అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు.

ఈ రెండు పార్టీల మధ్య అధికారకంగా ఎలాంటి పొత్తు లేకపోయినా పలు సందర్భాల్లో కలిసి పని చేశాయని ఆయన గుర్తు చేశారు. వారిని అప్పుడూ ఎదుర్కొన్నాం. ఇప్పుడూ ఎదుర్కొంటామని సీతారాం ఏచూరి అన్నారు. అయితే, వామపక్ష తీవ్రవాదులను బలపరిచే వారితో కలిసి ఎలా పనిచేస్తారన్న దానిపై కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఏచూరి అన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న వారితో ఎలా పొత్తుకు సిద్ధపడుతున్నారో కూడా సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని ఏచూరి చెప్పారు. కాంగ్రెస్-టీసీ పొత్తు వల్ల తమకెలాంటి నష్టం వాటిల్లబోదని ఏచూరీ ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu