Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం - హత్య కేసులో 8 రోజుల్లో కోర్టు తీర్పు!

అత్యాచారం - హత్య కేసులో 8 రోజుల్లో కోర్టు తీర్పు!
, బుధవారం, 24 జులై 2013 (09:33 IST)
File
FILE
అత్యాచారం, హత్య కేసుల్లో కేవలం ఎనిమిది రోజుల్లోనే మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ తీర్పును మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా న్యాయస్థానం విధించింది.

గత ఏప్రిల్‌లో ఆరేళ్ల బాలికపై కమలేష్ కుష్వాహా (26) అనే యువకుడు ఆరేళ్ళ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అత్యాచారం, హత్య అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.

ఈ నెల 15న దీనిపై విచారణ ప్రారంభించిన జిల్లా సెషన్స్ న్యాయస్థానం 8 రోజుల పాటు ఇరు పక్షాలవాదనలు ఆలకించింది. చివరకు కమలేష్‌పై మోపిన అభియోగాలు నిజమేనని నిర్ధారించిన న్యాయమూర్తి రాజీవ్ శర్మ మంగళవారం కమలేష్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu