Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ .. ధర రూ.19,999

జియోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ .. ధర రూ.19,999
, మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (18:28 IST)
చైనా యాపిల్ ఫోనుగా గుర్తింపు పొందిన జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోనును విడుదల చేయనుంది. ఈ ఫోను ధర రూ.23999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. 
 
16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను నిర్ణయించినట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేసే జియోమి ఎంఐ 4 ఫోన్లో క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర సదుపాయాలు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu