రింగింగ్ బెల్స్ మరో సంచలనం... రూ.10 వేలకే హెచ్డీ లెడ్ టీవీ... 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం
రింగింగ్ బెల్స్ మరో సంచలనం సృష్టించబోతోంది. ఇప్పటికే ఫ్రీడమ్ 251 పేరుతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ను అందిస్తున్న ఈ కంపెనీ.. ఇపుడు ఫ్రీడం టీవీలంటూ ముందుకురానుంది.
రింగింగ్ బెల్స్ మరో సంచలనం సృష్టించబోతోంది. ఇప్పటికే ఫ్రీడమ్ 251 పేరుతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ను అందిస్తున్న ఈ కంపెనీ.. ఇపుడు ఫ్రీడం టీవీలంటూ ముందుకురానుంది. కేవలం 10 వేల రూపాయల లోపే చీసెప్ట్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని అందించేందుకు సిద్ధమవుతోంది. 1366x768 ఫిక్సెల్స్, రిజల్యూషన్, 3000 కాంట్రాస్ట్ రేషియో, రెండు హెచ్డీ ఎంఐ పోర్ట్సు, రెండు యూసీబీ పోర్టులు, రెండు స్పీకర్ల తదితర ఫీచర్లతో ఈ టీవీని అందుబాటులోకి తీసుకునిరానుంది.
తమ కొత్త 'ప్రీడమ్ 9900' టీవీల కోసం ఆగస్టు 15వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. నోయిడా ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ మేకర్ 31.5 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీలను రూ.9,900లకే అందించనున్నట్టు వెల్లడించింది.
ఈ టీవీల బుకింగ్స్ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుందనీ, డెలివరీ వచ్చే ఆగస్టు 16 (2017 ఆగస్టు 16) నుంచి ప్రారంభిస్తామని అందులో పేర్కొంది. ముఖ్యంగా క్యాష్ ఆన్ పద్ధతిలో వీటిని డెలివరీ చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అసక్తివున్నవారు సంస్థ వెబ్సైట్ రింగింగ్బెల్స్.కో.ఇన్ వెబసైట్లో బుకింగ్లు చేసుకోవచ్చని తెలిపింది.