రిలయన్స్ జియో 4జీ సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా 90 రోజుల పాటు అన్లిమిటెడ్ మొబైల్ ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ సేవలను పొందవచ్చు. అయితే రిలయన్స్ జియో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ 4జీ సేవలను పొందాలంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల ఉద్యోగుల నుంచి ఆహ్వానం అందుకోవాల్సి ఉంటుంది.
అప్పుడే సిమ్ కార్డును పొందటానికి వీలుంటుంది. అలాగే రిలయన్స్ 4జీ సేవలు పొందాలనుకుంటే.. రిలయన్స్ డిజిటల్ ద్వారా విక్రయిస్తున్న లైఫ్ మొబైల్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సంస్థ ఇప్పటికే తన సర్వీసులకు సపోర్ట్ చేసే లైఫ్ మొబైల్స్ను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి 5,599 రూపాయల నుంచి 19,499 రూపాయల వరకు ఉందని రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.