Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ నోట్ 7 మాత్రమే కాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కూడా పేలిపోయింది!

శాంసంగ్ కంపెనీలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారలేదు. ఆ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ రకాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలింది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించలేదు. ఇంతలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ

గెలాక్సీ నోట్ 7 మాత్రమే కాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కూడా పేలిపోయింది!
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:01 IST)
శాంసంగ్ కంపెనీలో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారలేదు. ఆ కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ రకాల్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలింది. ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించలేదు. ఇంతలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ పేలిపోయింది. 
 
చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది. ఒరిజినల్ చార్జర్‌తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది. రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగింది. 
 
మరోవైపు... శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. శాంసంగ్ నోట్ 7 మోడల్‌ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్‌కు వచ్చ ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రపు నీటిలో కాలుపెట్టాడు... నాలుగు రోజుల్లో అతడిని బ్యాక్టీరియా తినేసింది...