గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ 2015 జీతం ఎంతో తెలుసా...?
గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ 2015 సంవత్సరం మొత్తానికి ఎంత జీతం వచ్చిందో తెలుసా...? అక్షరాలా రూ. 5.3 కోట్లు. 2016, 17 సంవత్సరాల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ గత ఏడాది ఆగస్టులో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఇక ఆయన కెరీర్ను చూస్తే
గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ 2015 సంవత్సరం మొత్తానికి ఎంత జీతం వచ్చిందో తెలుసా...? అక్షరాలా రూ. 5.3 కోట్లు. 2016, 17 సంవత్సరాల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ గత ఏడాది ఆగస్టులో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఇక ఆయన కెరీర్ను చూస్తే... 2004లో గూగుల్ కంపెనీలో పిచాయ్ చేరారు. ఆ సమయంలో ఆయన గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్ కోసం పనిచేశారు.
సెప్టెంబరు 2008లో క్రోమ్ బ్రౌజర్ విజయవంతం కావడంతో నెట్ బుక్స్, డెస్క్ టాప్ కంప్యూటర్స్ విభాగానికి వెళ్లారు. అక్కడ సంచలనాలు సృష్టించారు. ఆ తర్వాత ఏడాదికి ఆండ్రాయిడ్ సహ వ్యవస్థాపకుడు ఆండీ రూబిన్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత 2015లో పూర్తిస్థాయి గూగుల్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు.