Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏఎస్‌సీఐ అర్ధ-వార్షిక ఫిర్యాదుల నివేదిక: డిజిటల్ మీడియా నుంచే 97 శాతం ఉల్లంఘనలు

Advertiesment
Digital media

ఐవీఆర్

, బుధవారం, 12 నవంబరు 2025 (20:31 IST)
డిజిటల్ మీడియా ప్రకటనల ఉల్లంఘనలలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉందని, మొత్తం 97% వాటా కలిగి ఉందని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) అర్థ-వార్షిక ఫిర్యాదుల నివేదిక (2025–26) తెలియజేస్తోంది. ఏప్రిల్, సెప్టెంబర్ 2025 మధ్య, ASCI 6,841 ఫిర్యాదులను సమీక్షించింది. 6,117 ప్రకటనలపై విచారణ చేసింది. వీటిలో 98 శాతం వాటికి సవరణ అవసరం. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఫిర్యాదులలో 70% పెరుగుదల, ప్రాసెస్ చేయబడిన ప్రకటనలలో 102% పెరుగుదల ఉన్నాయి. ఇదంతా కూడా ASCI తీవ్రతర నిఘా, వినియోగదారుల నిఘా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి నియంత్రణ సంస్థల సహకార ఫలితం.
 
చట్టవిరుద్ధ బెట్టింగ్ (4,575 ప్రకటనలు, 3 ఇతర ప్రకటనలు సరోగేట్స్‌గా నివేదించబడ్డాయి), వ్యక్తిగత సంరక్షణ (367), ఆరోగ్య సంరక్షణ (332), ఆహారం, పానీయాలు(211), విద్య(71) మొదటి ఐదు ఉల్లంఘన రంగాలుగా నిలిచాయి. ప్రాసెస్ చేసిన కేసులలో ఈ రంగాలన్నీ కలిపి దాదాపు 90%  వరకు ఉన్నాయి.
 
నివేదికలోని ముఖ్యాంశాలు
భారతదేశంలో అత్యంత ఉల్లంఘన వర్గంగా కొనసాగుతున్న ఆఫ్‌షోర్/అక్రమ బెట్టింగ్
 
ఫ్లాగ్ చేయబడిన 4,575 ప్రకటనలలో, 99% ప్రకటనలు ASCI చురుకైన నిఘా ద్వారా గుర్తించబడ్డాయి. వీటిని తొలగించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్‌కు వాటి గురించి తెలియజేయడం జరిగింది.
 
ఈ ప్రకటనలు, తరచుగా గేమింగ్ ప్రమోషన్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్ భాగస్వామ్యాలుగా కల్పిత రూపంలో ఉంటాయి. చట్టబద్ధంగా నిషేధించబడినప్పటికీ డిజిటల్ మీడియా ద్వారా వినియోగదారులను చేరుతూనే ఉంటాయి.
 
డిజిటల్ మీడియా ఆధిపత్యం
మొత్తం ఉల్లంఘనలలో 97% డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో జరిగాయి. వీటికి మెటా (78.9%), వెబ్‌ సైట్‌లు (13.7%), గూగుల్ (4.6%), ప్రాపర్టీ పోర్టల్‌లు (3%) నాయకత్వం వహిస్తున్నాయి.
 
టీవీ, ప్రింట్ వంటి సంప్రదాయ మీడియా 3% కంటే తక్కువ కేసులను నమోదు చేసింది.
 
ఈ ఫలితాలు డిజిటల్ పారదర్శకత, జవాబుదారీతనంపై ASCI నిరంతర దృష్టిని బలోపేతం చేస్తాయి.
 
ప్రభావశీలురపై మరింత నిశిత పరిశీలన
1,173 ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనలను ASCI విచారించింది, వాటిలో 98% వాటికి సవరణ అవసరం.
 
దాదాపు 59% ప్రకటనలు చట్టం ప్రకారం అనుమతించబడని ఉత్పత్తులను ప్రోత్సహించాయి.
 
ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారతదేశంలోని అగ్రశ్రేణి డిజిటల్ స్టార్లలో 76% మంది, ASCI, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి అవసరమైన డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కనుగొనబడింది. ఇది ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనలలో ప్రామాణికత, నిజాయితీకి పేలవ ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
 
సానుకూలం వైపు, ప్రభావితం చేసేవారిలో స్వచ్ఛంద సమ్మతి 90%కి చేరుకుంది. ఉల్లంఘనలు గుర్తించబడినప్పుడు, ప్రభావితం చేసేవారు వాటిని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారని ఇది చూపిస్తుంది. అయినప్పటికీ, చాలామంది ఇప్పటికీ తమ ఉల్లంఘనలు గుర్తించబడలేదని ఆశిస్తున్నారు. చెల్లింపు భాగస్వామ్యాలను బహిర్గతం చేయడంలో విఫలమవడం ఈ ఉల్లంఘనలలో ప్రధానంగా ఉంది.
 
వివాదాస్పద కేసుల పెరుగుదల ప్రభావవంత పరిష్కారానికి, స్వచ్ఛంద సమ్మతికి దారితీస్తుంది.
 
ఈ అర్ధ-వార్షిక కాలంలో ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలిన 62% ప్రకటనలు ASCI సమాచారం తర్వాత ఎలాంటి సవాలు లేకుండా ఉపసంహరించబడ్డాయి లేదా సవరించబడ్డాయి, 2024-25లో ఉన్న 59%తో పోల్చి చూసినప్పుడు.
 
ఈ అర్ధ-వార్షిక కాలంలో మొత్తం స్వచ్ఛంద సమ్మతి రేట్లు 2024-25 (మొత్తం FY)లోని 83%తో పోలిస్తే 88 శాతానికి పెరిగాయి.
 
సగటు ఫిర్యాదు పరిష్కార సమయం 17 రోజులు.
 
నిరంతర సవాళ్లను ప్రదర్శిస్తున్న వివిధ రంగాల ధోరణులు
 
వ్యక్తిగత సంరక్షణ: పరిశీలనలో ఉన్న 367 ప్రకటనలలో, 64% ప్రకటన నిర్ణయాలు వివాద రహితంగా ఉన్నాయి; ఈ వర్గంలో చర్మ సంరక్షణ విభాగం అత్యధిక ఉల్లంఘనలకు దారితీసింది.
 
ఆరోగ్య సంరక్షణ: పరిశీలనలో ఉన్న 332 ప్రకటనలలో, పరిశీలించబడిన వాటిలో 82% కేసులు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్(1954) ను ఉల్లంఘించాయి.
 
ఆహారం, పానీయాలు: పరిశీలనలో ఉన్న 211 ప్రకటనలలో, 61% ఉల్లంఘనలు తప్పుదారి పట్టించే ఆరోగ్య లేదా పోషకాహార వాదనలను కలిగి ఉన్నాయి.
 
విద్య: పరిశీలనలో ఉన్న 71 ప్రకటనలలో, ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిన 45% ప్రకటనల ను ASCI జోక్యం తర్వాత స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు.
 
ASCI మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థలు, అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, నియంత్రణ సంస్థలతో పనిచేయడం వలన ఉల్లంఘనలను ముందస్తుగా గుర్తించడం, నివేదించడం గణనీయంగా మెరుగుపడింది. 2024లో 306 గా ఉన్న వినియోగదారుల ఫిర్యాదులు 2025లో 405కి పెరగడం కూడా బాధ్య తాయుతమైన ప్రకటనల పై ప్రజలకు అవగాహన, స్వీయ నియంత్రణపై గల ఎక్కువ నమ్మకాన్ని సూచిస్తుంది.   
 
ASCI సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ ఇలా అన్నారు: నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ ప్రకటనల  విస్తృతి, అలాగే అగ్రశ్రేణి ప్రభావశీలుర నిరాశపరిచే ప్రమాణాలు, మా ఇటీవలి కార్యకలాపాల్లో తెరపైకి వచ్చిన కొన్ని సవాళ్లు. డిజిటల్ యుగంలో వినియోగదారుల నమ్మకం దుర్బలంగా ఉంటోంది. ఇటువంటి పద్ధతులు పరిశ్రమకు పెద్దగా సమస్యలను సృష్టిస్తాయి. అయితే, వివాదాల కేసులలో బలమైన పెరుగుదలను, అలాగే స్వచ్ఛంద సమ్మతి రేట్లను గమనించడం పట్ల ASCI సంతో షంగా ఉంది. ఇది రక్షణ యొక్క మొదటి శ్రేణిగా తన పెరుగుతున్న పాత్రను నొక్కిచెబుతుంది. పునరావృతమయ్యే వాటికి, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే వా రికి, నియంత్రణ సంస్థల కఠినమైన చర్య బలమైన ప్రతిబంధకంగా ఉంటుంది, వినియోగదారుల ప్రయోజనా లను కాపాడటానికి సహాయ పడుతుంది. చట్టపరమైన చట్రంలో భాగంగా తగు చర్య కోసం మేం చట్టబద్ధ  నియంత్రణ సంస్థలతో సమాచారం పంచుకోవడం కొనసాగిస్తాం. వినియోగదారుల రక్షణ కోసం బలమైన ప్రక టనల నియంత్రణ చట్రా న్ని నిర్మించడానికి వాటాదారులందరితో కలసి పని చేస్తాం, వారికి సహకరిస్తాం.
 
 
ముఖ్యంగా గేమింగ్, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ వంటి సున్నిత, నియంత్రిత రంగాలలో ప్రకటనదారులకు ఈ ఫలితాలు సమ్మతిని బలోపేతం చేయడానికి, తగిన శ్రద్ధతో కొనసాగడానికి ఒక రిమైండర్‌గా నిలుస్తాయి. వినియోగదారులకు సంబంధించి, అభ్యంతరకరమైన లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలను పరిష్కరించడానికి విశ్వసనీయమైన, ప్రాప్యత చేయగల వేదికగా ASCI పాత్రను నివేదిక బలోపేతం చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్