Publish Date: Wed, 11 Mar 2026 (23:34 IST)
Updated Date: Wed, 11 Mar 2026 (23:35 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశవ్యాప్తంగా తన 4జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీంగా అభివృద్ధి చేసిన లక్ష 4జీ సైట్లను ప్రారంభించే ప్రక్రియలో ఉందని బుధవారం పార్లమెంటుకు సమాచారం అందింది.
లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97,906 4జీ సైట్లను ఏర్పాటు చేసిందని, వాటిలో 96,103 సైట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని అన్నారు.
దేశవ్యాప్తంగా హై-స్పీడ్ కనెక్టివిటీని విస్తరించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుందని పెమ్మసాని తెలిపారు. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ను మరింత బలంగా, పోటీతత్వంతో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
బీఎస్ఎన్ఎల్ కంపెనీకి మద్దతుగా, దాదాపు రూ. 3.22 లక్షల కోట్ల విలువైన మూడు పునరుద్ధరణ ప్యాకేజీలను కేంద్రం ఆమోదించిందని పెమ్మసాని శేఖర్ పేర్కొన్నారు. ఈ కంపెనీ తన టెలికాం మౌలిక సదుపాయాలను కూడా విస్తరించింది. 2014 నుండి, బీఎస్ఎన్ఎల్ తన నెట్వర్క్ను బలోపేతం చేయడానికి 13,748 2జీ బేస్ ట్రాన్స్సీవర్ స్టేషన్లు, 39,722 3జీ బేస్ స్టేషన్లు, 1,03,305 4జీ బేస్ స్టేషన్లను జోడించిందని పెమ్మసాని అన్నారు.