Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్టీడీ సేవలు మరింత చౌక

బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్టీడీ సేవలు మరింత చౌక
న్యూఢిల్లీ (ఏజెన్సీ) , సోమవారం, 9 జూన్ 2008 (16:16 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఎస్టీడి సేవలు మరింత చౌక ధరలకు లభ్యంకానున్నాయి. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ఎస్టీడి రేట్లలో యాభై శాతం మేరకు తగ్గిస్తున్న ఆ సంస్థ సోమవారం ప్రకటించింది.

అలాగే ల్యాండ్‌లైన్ ఫోన్ సేవలను కూడా మరింత తగ్గించింది. ల్యాండ్ లైన్‌ కలిగిన వినియోగదారులకు ఇకపై ఎస్టీడి సేవలు రూ.2.40 నుంచి రూ.1.20 పైసలకు తగ్గించారు. దేశంలోన్ని అన్ని నెట్‌వర్క్‌లకు 'సులభ్ ప్లాన్‌' వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.

అలాగే ఇంట్రా సర్కిల్‌ కాల్ ఛార్జర్స్‌ను యాభై శాతం మేరకు తగ్గించినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండి కులదీప్ గోయల్ తెలిపారు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్ వినియోగదారుల రోమింగ్ ఛార్జీల్లో కూడా మార్పులు చేసినట్టు చెప్పారు. ఇటీవల ప్రైవేట్ టెలిఫోన్ సంస్థలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్‌లు ఎస్టీడీ, రోమింగ్ ఛార్జీలను భారీగా తగ్గించిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu