Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూర్పుగోదావరి జిల్లాకు పూర్తిస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

తూర్పుగోదావరి జిల్లాకు పూర్తిస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు
కాకినాడ , శనివారం, 7 జూన్ 2008 (20:49 IST)
తూర్పు గోదావరి జిల్లాకు పూర్తిస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను త్వరలో అందిస్తామని జిల్లా టెలీకాం మేనేజర్ ఆర్ఎంఎం కృష్ణా చెప్పారు. ఇంటర్నెట్ సేవలు ప్ర్రస్తుతం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. కొద్దిమేర గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలు అందుతున్నాయని వివరించారు.

జిల్లాలో కొత్తగా 15 సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటువుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ సేవలు నిరంతరాయంగా వినియోగదారులకు అందుతాయని తెలియజేశారు. కొత్త టవర్లు రాకతో జిల్లాలో వీటి సంఖ్య 34కు చేరుకుంటుందని వివరించారు. ఈ ఏడాది చివరినాటికి వీటి సంఖ్య 50 చేరుకునేలా లక్ష్యం పెట్టుకున్నామని కృష్ణ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu