రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే ట్రేడింగ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ను సీఎస్కే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ను ఇవ్వాలంటే ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ చేసిన ప్రతిపాదనకు సీఎస్కే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
సంజూ శాంసన్ కోసం స్టాల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ను వదులుకునేందుకు సీఎస్కే సిద్దమైనట్లు సమాచారం. ఈ ఇద్దరిని తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరిస్తే.. ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది. సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్లో ఎక్కువ కాలం రాజస్థాన్ రాయల్స్కే ఆడాడు.
ఐపీఎల్ 2021 సీజన్ నుంచి కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈ డీల్పై త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఇరు జట్ల వర్గాలు పేర్కొన్నాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ చివరి దశలో ఉండటం..కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఆశించిన ఫలితాలు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.