దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు 158 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ముందుంచింది. ఇండియన్స్ బ్యాట్స్మెన్లలో రహనా (49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 62 పరుగులు) చేయగా, డుమిని (41 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు) సాధించాడు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన జయసూర్య (29) మెర్వ్ బౌలింగ్లో అవుట్ కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (0) కేవలం ఒక్క పరుగు కూడా చేయకుండా వినయ్ కుమార్ బౌలింగ్లో, బౌచర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లలో వినయ్ కుమార్, మెర్వ్లు చెరో వికెట్ సాధించారు.