Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాపై జీహాద్ ప్రకటించిన అల్‌ఖైదా

Advertiesment
అల్ఖైదా
అల్‌ఖైదాకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ అబూ యూహ్యా అల్ లిబీ చైనాపై జీహాద్ ప్రకటించారు.

చైనా దేశంలో జీహాద్ నిర్వహించాలని అల్‌ఖైదాకు చెందిన మోస్ట్ వాంటెడ్ కమాండర్ అబూ యూహ్యా అల్ లిబీ పిలుపునిచ్చారు.

చైనాలోని శిన్‌జియాంగ్ ప్రాతంలోనున్న ముస్లింలపై ఆ దేశం దాడులకు పాల్పడుతోందని, దీనికి ప్రతీకార చర్యగా ఆ దేశంలోనున్న వుయ్‌ఘుర్‌లోనున్న ముస్లింలు చైనా ప్రభుత్వంపై యుద్ధం చేయాలని ఆయన కోరారు. అలాగే వుయ్‌ఘుర్‌లోనున్న ముస్లింలకు చేయూతనివ్వాలని పలు ముస్లిం సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.

ఇలా చైనా దేశంపై అల్‌ఖైదా విరుచుకుపడటం ఇదే తొలిసారి. గతంలో రష్యాలో ఏవిధంగానైతే ఆ దేశ నాయకులపై దాడులకు పాల్పడ్డారో అలాగే చైనాలో కూడా భవిష్యత్తులో దాడులకు పాల్పడుతారని ఆయన తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వీడియో ద్వారా హెచ్చరించారు.

తూర్పు తుర్కిస్థాన్‌లోని ముస్లింలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుతం ముస్లింల కర్తవ్యంగా ఆయన అభివర్ణించారు. ప్రతి ఒక్క ముస్లిం కూడా జీహాద్‌ కొరకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu