Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద పేలుళ్ళు

Advertiesment
ఆఫ్గనిస్థాన్
, గురువారం, 8 అక్టోబరు 2009 (11:04 IST)
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోనున్న భారతదేశ దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

గురువారం ఉదయం గం. 10.15లకు కాబూల్‌లోని దౌత్యకార్యాలయం వద్దనున్న సిటీ సెంటర్ భవనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన ఓ జీపు గుద్దుకుంది. దీంతో అక్కడ పేలుళ్ళు జరిగాయి. పేలుళ్ళ కారణంగా అక్కడున్న పాస్‌పోర్ట్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. పేలుళ్ళు జరగడంతో ఒక్కసారిగా సంచలనం కలిగింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాంద జరగలేదు.

ఇదిలావుండగా సిటీ సెంటర్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే ప్రాంతం. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం భద్రతా దళాధికారులకు ఓ సవాలుగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu