Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్ రోడ్డు ప్రమాదంలో విశాఖ సంతోష్ మృతి.. వీకెండ్ సెలవులు..

న్యూజిలాండ్ రోడ్డు ప్రమాదంలో విశాఖ సంతోష్ మృతి.. వీకెండ్ సెలవులు..
, సోమవారం, 26 జనవరి 2015 (11:41 IST)
న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నందగిరినగర్‌కు చెందిన చెరుకూరి సంతోష్ కుమార్ (26) మరణించాడు. సంతోష్ కుమార్ మరణవార్త అతని స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు చేరింది. రెండురోజుల్లో మృతదేహాన్ని విశాఖపట్నంకు పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు, అక్కడి తెలుగు సంఘం హామీ ఇచ్చింది. రెండు రోజులు పూర్తైన కూడా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
జనవరి 22వ తేదీ సాయంత్రం జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెరుకూరి నూకరాజు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్ మరణించాడు. పీజీ చదవడానికి 2012లో న్యూజిలాండ్ వెళ్లాడు.
 
చదువు పూర్తి అయిన తర్వాత నాలుగు నెలల క్రితం అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న కంపెనీ విధుల నిమిత్తం 22న న్యూజిలాండ్ సమీపంలోని టవరంగా అనే మరో ప్రాంతానికి వెళ్లాడు. పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా కారును భారీ ట్రక్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu