Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లష్కర్ ఎ తొయిబాకు అమెరికా షాక్.. విద్యార్థి విభాగం కూడా ఉగ్ర సంస్థే

ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. లష్కర్ ఎ తొయిబా విద్యార్థి విభాగమైన అల్ మహమ్మదీయను కూడా ఉగ్రవాద సంస్థగా అగ్రరాజ్యం ప్రకటించింది. దీంతో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాద కార్యకలాప

లష్కర్ ఎ తొయిబాకు అమెరికా షాక్.. విద్యార్థి విభాగం కూడా ఉగ్ర సంస్థే
, గురువారం, 29 డిశెంబరు 2016 (09:42 IST)
ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తొయిబాకు అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. లష్కర్ ఎ తొయిబా విద్యార్థి విభాగమైన అల్ మహమ్మదీయను కూడా ఉగ్రవాద సంస్థగా అగ్రరాజ్యం ప్రకటించింది. దీంతో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు, ఆ సంస్థతో సంబంధం ఉన్న విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసేందుకు, సానుభూతిపరులను ప్రశ్నించేందుకు అధికారులకు వీలుచిక్కినట్టయింది. 
 
లష్కర్ ఎ తొయిబా పాక్ కేంద్రంగా భారత్‌ను అస్థిరం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. 1987లో హఫిజ్ సయీద్ ఈ ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై దాడులు జరిపింది లష్కర్ ఎ తొయిబాయే. హఫిజ్ సయీద్‌ తలకు వెల కట్టినా అతడి ఆట కట్టించడంలో అమెరికా చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. అయితే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రాకతో పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. ఇందులోభాగంగానే అల్ మహమ్మదీయను ఉగ్రసంస్థగా ప్రకటించినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయండి: కేంద్రం