Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక భారత్ సహనాన్ని పరీక్షిస్తే పాకిస్తాన్‌కు మూడినట్లే... అమెరికా పత్రిక కథనం

అమెరికాలో తెల్లవారింది. ఇప్పుడే అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించిన కథనంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ అది అమెరికాకు సంబంధించింది కాదు. భారత్-పాకిస్తాన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి. ఆ కథనంలో పేర్కొన్న వివరాలను ఒకసారి చూస్తే... కాశ్మీరుల

ఇక భారత్ సహనాన్ని పరీక్షిస్తే పాకిస్తాన్‌కు మూడినట్లే... అమెరికా పత్రిక కథనం
, బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:39 IST)
అమెరికాలో తెల్లవారింది. ఇప్పుడే అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించిన కథనంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ అది అమెరికాకు సంబంధించింది కాదు. భారత్-పాకిస్తాన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి. ఆ కథనంలో పేర్కొన్న వివరాలను ఒకసారి చూస్తే... కాశ్మీరులోని యూరీ సెక్టారుపై ఉగ్రవాదుల దాడి అనంతరం భారతదేశ ప్రధానమంత్రి సైనిక చర్యకు దిగకుండా ఎంతో సహనాన్ని పాటిస్తూ ఉన్నారని ఆయనను ప్రశంసించింది. 
 
పాకిస్తాన్ దేశాన్ని ఊహించని విధంగా దెబ్బ తీసేందుకు భారతదేశం సిద్ధమయ్యిందనీ, ఆ ప్రకారం చేస్తే పాకిస్తాన్ కు చావుదెబ్బ ఖాయమని పేర్కొంది. ఐతే భారతదేశం సహనాన్ని పాకిస్తాన్ చేతకానితనంగా భావిస్తే మటుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు జరిగితే మాత్రం భారతదేశం యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని వెల్లడించింది. అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతిని మార్చుకోవాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరదలొస్తే తెలంగాణ వెంకయ్యకు గుర్తే రాదు.. ఓన్లీ ఏపీనే గుర్తుంటుంది: కవిత