ఫ్రాన్స్లో ఉగ్రదాడి.. ఈ దఫా పేలుడు పదార్థాల ట్రక్కుతో... 80 మంది మృతి!
రోజురోజుకూ ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఫ్రాన్స్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడిలో ఏకంగా 80 మంది దుర్మణం చెందారు. ఫ్రాన్స్ నగరంలో లోనివీస్ ప్రాంతం సమీపంలో ఈ విషాదం చోటుచేసుక
రోజురోజుకూ ఉగ్రవాదుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఫ్రాన్స్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడిలో ఏకంగా 80 మంది దుర్మణం చెందారు. ఫ్రాన్స్ నగరంలో లోనివీస్ ప్రాంతం సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా సందర్భంగా ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రజలు అందరూ పండుగ సంబరాల్లో మునిగివున్న సమయంలో జనాలపైకి ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. ఈ మారణకాండలో 80 మంది దుర్మరణం చెందారు. మరో 50మంది పరిస్థితి విషమంగా ఉంది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రజల మధ్యలో దూసుకెళ్ళిన ట్రక్కులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని పోలీసులు ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు.